విలాప4tel_otsa
1బంగారం తన మెరుపును ఎలా కోల్పోయింది,మంచి బంగారం ఎలా మొద్దుబారిపోయింది!ప్రతి వీధి మూలలోప్రశస్తమైన రాళ్ల వంటి రత్నాలు చెల్లాచెదురుగా ఉన్నాయి.2ప్రశస్తమైన సీయోను పిల్లలు ఎలా అయిపోయారు,ఒకప్పుడు వారి విలువ బంగారంతో తూగేది,ఇప్పుడు మట్టి కుండలుగా,కుమ్మరి చేతి పనిగా పరిగణించబడుతున్నారు!3నక్కలు కూడాతమ పిల్లలకు పాలివ్వడానికి తమ రొమ్ములిస్తాయి,కానీ నా ప్రజలు ఎడారిలో నిప్పుకోడిలాహృదయం లేనివారయ్యారు.4దాహం వల్ల పసివారి నాలుకనోటి అంగిటికి అంటుకుపోతుంది;పిల్లలు ఆహారం కోసం వేడుకుంటారు,కానీ ఎవరూ వారికి ఇవ్వరు.5ఒకప్పుడు రుచికరమైన పదార్ధాలు తిన్నవారువీధుల్లో నిరుపేదలు.రాజ ఊదా రంగులో పెరిగినఇప్పుడు బూడిద కుప్పల మీద పడుకున్నారు.6సొదొమ శిక్ష కంటేనా ప్రజల శిక్ష గొప్పది,ఆమెకు సహాయం చేయడానికి చేయి లేకుండానేక్షణాల్లో పడగొట్టబడింది.7అందలి అధిపతులు మంచుకంటే స్వచ్ఛమైన వారు,పాలకంటే తెల్లని వారు.శరీరాలు పగడాలకంటే ఎర్రగా ఉన్నాయి,వారి దేహకాంతి నీలమణి లాంటిది.8అలాంటివారి ఆకారం బొగ్గు కంటే నలుపుగా అయింది,వీధుల్లో వారిని చూసి వారిని గుర్తు పట్టలేదు.వారి చర్మం వారి ఎముకలకు అంటుకుపోయిఎండిన కర్రలా అయింది.9కరువు వారిని దెబ్బతీసింది,పంటలు పండవు.ఈ బాధకు క్షీణించిపోయారు,ఇంతకంటే ఖడ్గం చేత చావడం మహా భాగ్యం అనిపిస్తుంది.10కనికరంగల స్త్రీలుతమ సొంత చేతులతో తమ పిల్లలను వండుకున్నారు,నా ప్రజలు నాశనమైనప్పుడు,వారికి ఆహారం అయ్యారు.11యెహోవా తన కోపాన్ని పూర్తిగా చల్లార్చారు.ఆయన తన తీవ్రమైన కోపాన్ని కుమ్మరించాడు.ఆయన సీయోనులో అగ్నిని రప్పించారు,అది దాని పునాదులను దహించివేసింది.12శత్రువులు, శత్రువులుయెరూషలేము గుమ్మాల్లోకి ప్రవేశించవచ్చనిభూరాజులు నమ్మలేదు,ప్రపంచంలోని జనాంగలెవరూ నమ్మలేదు.13అయితే అది ఎందువల్ల జరిగిందంటే,నీతిమంతుల రక్తాన్ని చిందించినదాని ప్రవక్తల పాపాల వల్ల,దాని యాజకుల దోషాల వల్ల జరిగింది.14ఇప్పుడు వారు గ్రుడ్డివారిలావీధుల్లో తడుముతూ తిరుగుతున్నారు.వారు రక్తంతో ఎంతగా అపవిత్రం అయ్యారంటే,వారి వస్త్రాలను తాకడానికి ఎవరూ సాహసించరు.15“వెళ్లిపొండి! మీరు అపవిత్రులు!”అని ప్రజలు గట్టిగా వారిమీద అరుస్తారు.“దూరం! దూరం! మమ్మల్ని తాకవద్దు!”అని వారు పారిపోయి, తిరుగులాడుతున్నప్పుడు,దేశాల్లో ఉన్న ప్రజలు,“వారు ఇకపై ఇక్కడ ఉండడానికి వీల్లేదు” అని అంటారు.16యెహోవా తానే వారిని చెదరగొట్టారు;ఆయన ఇకపై వారిని పట్టించుకోరు.యాజకుల పట్ల ఇక గౌరవం చూపించరు,పెద్దల పట్ల దయ చూపించరు.17పైగా, సహాయం కోసం వ్యర్థంగా,మేము మా గోపురాల నుండి;మమ్మల్ని రక్షించలేని దేశం కోసం ఎదురుచూస్తూమా కళ్లు క్షీణించిపోయాయి.18ప్రజలు అడుగడుగునా మమ్మల్ని పొంచి ఉన్నారు,మేము మా వీధుల్లో నడవలేకపోయాము.మా అంతం దగ్గరపడింది, మా రోజులు లెక్కించబడ్డాయి,మా అంతం వచ్చింది.19మమ్మల్ని వెంటాడుతున్నవారుఆకాశంలో ఎగిరే గ్రద్ద కంటే వేగంగా ఉన్నారు;పర్వతాల మీదుగా మమల్ని వెంబడించిఎడారిలో మాకోసం వేచి ఉన్నారు.20యెహోవా అభిషిక్తుడు, మన ప్రాణానికి ఊపిరి.వారి ఉచ్చులో చిక్కుకున్నాడు.ఆయన నీడలోమనం ప్రజలమధ్య జీవిస్తాం అని అనుకున్నాము.21ఎదోము కుమారీ,ఊజు దేశంలో నివసిస్తున్నదానా, ఆనందించి సంతోషించు.అయితే గిన్నె మీకు కూడా పంపబడుతుంది;నీవు త్రాగి మత్తెక్కి వస్త్రాలు ఊడిపోయి నగ్నంగా ఉంటావు.22సీయోను కుమారీ, నీ శిక్ష పూర్తి కాబోతుంది;ఆయన మీ చెరను పొడిగించరు.కానీ ఎదోము కుమారీ, ఆయన నీ పాపాన్ని శిక్షిస్తారు,నీ దుర్మార్గాన్ని బట్టబయలు చేస్తారు.